పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పురూరవుని కథ

  •  
  •  
  •  

9-420-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ్నిచేఁ బురూరవుఁ
డా జ్ఞేశ్వరు ననంతు రి వేదమయున్
శ్రీయుతుఁ గూర్చి యజించె గు
ణాయుతుఁ డూర్వశిఁ గనంగ రిగెడు కొఱకై.

టీకా:

ఆ = ఆ; అగ్ని = అగ్ని; చేన్ = వలన; పురూరవుడు = పురూరవుడు; ఆ = ఆ; యజ్ఞేశ్వరున్ = నారాయణుని {యజ్ఞేశ్వరుడు - యజ్ఞములకు ప్రభువు, విష్ణువు}; అనంతున్ = నారాయణుని {అనంతుడు - తుదలేని వాడు, విష్ణువు}; హరిన్ = నారాయణుని {హరి - భక్తుల హృదయములను ఆకర్షించెడి వాడు, విష్ణువు}; వేదమయున్ = నారాయణుని {వేదమయుడు - వేదములు స్వరూపముగా కలవాడు, విష్ణువు}; శ్రీయుతున్ = నారాయణుని {శ్రీయుతుడు - శ్రీ (లక్ష్మీదేవి, సంపదల)తో యుతుడు (కూడి యుండువాడు), విష్ణువు}; గూర్చి = గురించి; యజించెన్ = యాగములు చేసెను; గుణాయుతుండు = గుణశాలి; ఊర్వశిన్ = ఊర్వశి; కనంగన్ = దర్శనమునకు; అరిగెడు = వెళ్ళుట; కొఱకై = కోసము;

భావము:

ఊర్వశి ఉన్న లోకానికి వెళ్ళడానికి, పురూరవుడు ఆ అగ్నితో యజ్ఞేశ్వరుడు, అనంతుడు, వేదమయుడు, శ్రీపతి అయిన శ్రీహరిని గురించి యాగాలు చేసాడు.