పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పురూరవుని కథ

  •  
  •  
  •  

9-404-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇంద్రుండు గంధర్వులం బనిచిన వారు నడురేయిం జని చీఁకటి నూర్వశి పెంచుచున్న యేడకంబులం బట్టిన నవి రెండును మొఱపెట్టిన; వాని మొఱ విని రతిఖిన్నుండై మేను మఱచి కూరుకుచున్న పురూరవు కౌఁగిటనుండి యూర్వశి యిట్లనియె.

టీకా:

ఇంద్రుండు = ఇంద్రుడు; గంధర్వులన్ = గంధర్వులను; పనిచినన్ = పంపించగా; వారున్ = వారు; నడురేయిన్ = అర్థరాత్రి; చని = వెళ్ళి; చీకటిన్ = చీకట్లో; ఊర్వశి = ఊర్వశి; పెంచుచున్న = పెంచుకుంటున్న; ఏడకంబులన్ = పొట్టేళ్ళను; పట్టినన్ = పట్టుకు పోతుండగ; అవి = అవి; రెండును = రెండు; మొఱపెట్టినన్ = ఆర్తనాదాలు చేయ; వానిన్ = వాటి యొక్క; మొఱ = అరుపులను; విని = విని; రతి = సురతమువలన; ఖిన్నుడు = అలసినవాడు; ఐ = అయ్యి; మేను = ఒళ్ళు; మఱచి = తెలియకుండ; కూరుకుచున్ = నిద్రపోవుచు; ఉన్న = ఉన్నట్టి; పురూరవు = పురూరవుని; కౌగిటన్ = ఆలింగనము; నుండి = నుండి; ఊర్వశి = ఊర్వశి; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

ఇంద్రుడు గంధర్వులను పంపించాడు. వారు అర్థరాత్రి వేళ చీకట్లో ఊర్వశి పెంచుకొంటున్న పొట్టేళ్ళను పట్టుకుపోసాగారు. అవి రెండు గట్టిగా అరవసాగాయి. వాటి అరుపులను వినిన ఊర్వశి, తన కౌగిలిలో రతి అనంతరం అలసిపోయి ఒళ్ళు తెలియకుండ నిద్రపోతున్న పురూరవుడితో ఇలా అన్నది.