పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : శ్రీరామాదుల వంశము

  •  
  •  
  •  

9-358-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వగచి, రామచంద్రుండు బ్రహ్మచర్యంబు ధరియించి, పదుమూఁడువేల యేం డ్లెడతెగకుండ నగ్నిహోత్రంబు చెల్లించి తా నీశ్వరుండు గావునఁ దన మొదలినెలవుకుం జనియె నివ్విధంబున.

టీకా:

అని = అని; వగచి = బాధపడి; రామచంద్రుండు = శ్రీరాముడు; బ్రహ్మచర్యంబు = బ్రహ్మచర్యమును; ధరియించి = చేపట్టి; పదుమూడువేల = పదమూడువేల(13,000); ఏండ్లు = సంవత్సరములు; ఎడతెగకుండన్ = ఎడతెగకుండ; అగ్నిహోత్రంబున్ = హోమమును; చెల్లించి = నడిపించి; తాన్ = అతను; ఈశ్వరుండు = భగవంతుడు; కావునన్ = కనుక; తన = తనయొక్క; మొదలినెలవు = మూలస్థానము; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.

భావము:

ఇలా బాధపడిన శ్రీరాముడు బ్రహ్మచర్యం చేపట్టి పదమూడువేల (13,000) సంవత్సరాలు ఎడతెగకుండా హోమాలు నడిపించి భగవంతుడు కనుక తన మూలస్థానం పరమపదానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా....