పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సురభి ఆవిర్భావము

  •  
  •  
  •  

8-251-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నా రత్నాకరంబు సురాసురులు ద్రచ్చునెడ.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; రత్నాకరంబు = సముద్రమును; సుర = దేవతలు; అసురులున్ = రాక్షసులు; త్రచ్చు = చిలికెడి; ఎడన్ = సమయమునందు.

భావము:

హాలాహలభక్షణం పిమ్మట మరల, దేవతలూ రాక్షసులూ సముద్రాన్ని చిలక సాగారు.