పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సురలు బ్రహ్మ శరణు జొచ్చుట

  •  
  •  
  •  

8-150-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఏనును మీరును గాలము
మావ తిర్యగ్లతా ద్రు స్వేదజముల్
మానుగ నెవ్వని కళలము
వానికి మ్రొక్కెదముగాక గవఁగ నేలా?

టీకా:

ఏనును = నేను; మీరును = మీరు; కాలము = కాలము; మానవ = నరులు; తిర్యక్ = జంతువులు; లతా = లతలు; ద్రుమ = చెట్లు; స్వేదజములు = సూక్షజీవులు {స్వేదజము - స్వేదమునుండి పుట్టునవి, పురుగులోనగునవి}; మానుగన్ = చక్కగ; ఎవ్వని = ఎవనియొక్క; కళలమున్ = అంశలమో; వాని = అతని; కిన్ = కి; మ్రొక్కెదముగాక = మొరపెట్టుకొనెదముగాక; వగవన్ = శోకించుట; ఏలా = ఎందుకు.

భావము:

“నాకూ, మీకూ, కాలానికీ, మానవులకూ, పశువులకూ, పక్షులకూ, చెట్లకూ, తీగలకూ, చెమటతో పుట్టే అల్పజీవులకూ, మూలపురుషుడు భగవంతుడు. అతనిని మనము శరణు వేడుదాము. మీరు దుఃఖపడకండి.