పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సురలు బ్రహ్మ శరణు జొచ్చుట

  •  
  •  
  •  

8-149-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నెలవు వెడలి వచ్చి నిస్తేజులై నట్టి
వేల్పుగములఁ జూచి వేల్పుఁ బెద్ద
రమపురుషుఁ దలఁచి ప్రణతుఁడై సంఫుల్ల
ద్మవదనుఁ డగుచుఁ లికెఁ దెలియ.

టీకా:

నెలవు = ఇల్లువాకిలి; వెడలి = వదలి; వచ్చి = వచ్చి; నిస్తేజులు = కాంతివిహీనులు; ఐనట్టి = అయినటువంటి; వేల్పు = దేవతల; గములన్ = సమూహములను; చూచి = చూసి; వేల్పు = దేవతల; పెద్ద = నాయకుడు; పరమపురుషున్ = హరిని; తలచి = స్మరించి; ప్రణతుడు = నమస్కరించినవాడు; ఐ = అయ్యి; సంఫుల్ల = పూర్తిగా వికసించిన; పద్మ = పద్మమువంటి; వదనుడు = ముఖముగలవాడు; అగుచున్ = అగుచు; పలికెన్ = చెప్పెను; తెలియ = తెలియునట్లు.

భావము:

తమ ఇల్లూ, వాకిలీ విడిచిపెట్టి కాంతి విహీనులు అయి తన వద్దకు వచ్చిన దేవతలను బ్రహ్మదేవుడు చూశాడు. పరమాత్మకు నమస్కరించి, ధ్యానం చేసాడు. తరువాత వికసించిన ముఖకమలంతో ఇలా అన్నాడు.