పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారాయణుని వైషమ్య అభావం

  •  
  •  
  •  

7-20-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లుగం గారణ మేమి విప్రులకు? ము న్నా విప్రు లెవ్వారు? ని
శ్చలు లేకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారు లీశాను వ
ర్తులు వైకుంఠపురీనివాసు లన విందున్ వారి కెబ్భంగి నీ
జన్మంబులు వచ్చె? నారద! వినం గౌతూహలం బయ్యెడిన్."

టీకా:

అలుగన్ = కోపించుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; విప్రుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; మున్ను = పూర్వము; ఆ = ఆ; విప్రులు = బ్రాహ్మణులు; ఎవ్వారు = ఎవరు; నిశ్చలులు = చపలతలేనివారు; ఏకాంతులు = అంతరంగభక్తులు; నిర్జితేంద్రియులు = ఇంద్రియముల నణచిన వారు; నిస్సంసారులు = సంసార బంధములు లేనివారు; ఈశానువర్తులు = భగవంతు ననుసరించు వారు; వైకుంఠ = వైకుంఠము యనెడి; పురీ = పురమునందు; నివాసులు = నివసించెడివారు; అనన్ = అని; విందున్ = విన్నాను; వారి = వారల; కిన్ = కి; ఏ = ఏ; భంగిన్ = లాగున; ఈ = ఇట్టి; ఖల = నీచ; జన్మంబులు = పుట్టుకలు; వచ్చెన్ = కలిగినవి; నారద = నారదుడా; వినన్ = వినవలెనని; కౌతూహలంబు = ఉత్సుకత; అయ్యెడిన్ = కలుగుచున్నది.

భావము:

“ఓ నారదమునీంద్రా! ఆ వేదమూర్తులైన ఆ విప్రులు ఎవరు? వారికి ఆగ్రహం ఎందుకు వచ్చింది; విష్ణుమందిర ద్వారపాలకులు ‘నిశ్చలమైన, భక్తి ప్రపత్తులు కలవారు; ఏకాంత దాసుల; ఇంద్రియజయం కలవారు; సంసారబంధాలలో తగుల్కొనని వారు; నిరంతరం జగన్నాథుని ఆజ్ఞను పాటించేవారు; సాక్షాత్తు వైకుంఠంలో నివసించే వారు’. అటువంటి వాళ్ళు విప్రశాపానికి ఎలా గురయ్యారు? వాళ్ళకి దుష్టజన్మలు ఎలా కలిగాయి? ఇదంతా వినాలని కుతూహలంగా ఉంది చెప్పండి.”