పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-175-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా లనను మీ వలనను
దేవాసుర గణము వలనఁ ద్రిజగంబులలో
నే గలఁ బొందఁకుండఁగఁ
గావం గలవారు పుడమిఁ ల వైష్ణవులన్.

టీకా:

నా = నా; వలనను = మూలమున; మీ = మీ; వలనను = మూలమున; దేవ = దేవతలు; అసుర = రాక్షసులు; గణము = సమూహముల; వలనన్ = మూలమున; త్రిజగంబుల = ముల్లోకముల; లో = లోను; ఏ = ఎలాంటి; వగలన్ = బాధలను; పొందకుండగన్ = పొందకుండగా; కావంగలవారు = కాపాడ గలవారు; పుడమిన్ = భూమిపై; కల = ఉన్నట్టి; వైష్ణవులన్ = విష్ణుమూర్తి భక్తులను.

భావము:

నా వలన, మీ వలన, దేవతల వలన, రాక్షసుల వలన ముల్లోకాలలో ఏ కష్టాన్నీ పొందకుండా విష్ణుభక్తులను కాపాడేవారు ఆ విష్ణుదూతలు.