పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-755-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుణి! సుతారలోచన యుతంబును మంజుసుధాసమానభా
సు మృదువాక్య యుక్తమును శోభిత కోమల లంబమాన సుం
చికురాభిరామము నుదారము నైన భవన్ముఖాబ్జమున్
సురుచిరలీల నెత్తి ననుఁ జూడుము; సిగ్గును జెంద నేటికిన్?"

టీకా:

తరుణి = స్త్రీ {తరుణి - తరుణ వయసున యున్నామె, స్త్రీ}; సుతార = సున్నితమైన; లోచన = చూపులు; యుతంబునున్ = కలిగినది; మంజు = మనోజ్ఞమైన; సుధా = అమృతమునకు; సమాన = సమానమైన; భాసుర = ప్రకాశించెడి; మృదు = మృదువైన; వాక్య = మాటలతో; యుక్తమును = కూడినది; శోభిత = శోభిల్లుతున్న; కోమల = సుకుమారమైన; లంబమాన = పొడుగైన; సుందర = అందమైన; చికుర = ముంగురులతో; అభిరామమునున్ = చక్కనైనది; ఉదారమున్ = విస్తారమైనది; ఐన = అయినట్టి; భవత్ = నీ యొక్క; ముఖ = మోము అనెడి; అబ్జమున్ = పద్మముతో; సు = చక్కటి; రుచిర = ప్రీతికరమైన; లీలన్ = విధముగ; ననున్ = నన్ను; చూడుము = చూడుము; సిగ్గున్ = సిగ్గును; చెందన్ = పడుట; ఏటికిన్ = ఎందులకు.

భావము:

పడతీ! కమనీయమైన కనీనికలు గల కన్నులతో, అమృతంలాగా తీయనైన పలుకులతో, పొడవైన తలవెంట్రుకలతో, సొగసులు విరజిమ్మే నీ ముఖ పద్మాన్ని ఎత్తి నా వంక చూడు. సిగ్గు పడకు”.