పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-503-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రమున నిటు పృథ్వాదులు
తమ కామితము లనఁగఁ గు భిన్నక్షీ
ము దోహన వత్సక భే
మునం దగఁ బిదికి; రంత రణీధవుఁడున్.

టీకా:

క్రమమునన్ = వరుసగా; ఇటు = ఇలా; పృథు = పృథుచక్రవర్తి; ఆదులు = మొదలగువారు; తమతమ = తమతమ; కామితంబులు = కోరికలు; అనన్ = అనుటకు; తగిన = తగినట్టి; భిన్న = రకరకముల; క్షీరమున్ = పాలను; దోహన = పితికెడి పాత్రలు; వత్సక = దూడలు యొక్క; భేదమున్ = భేదము; అందగన్ = పొందునట్లుగ; పిదికిరి = పితికిరి; అంతన్ = అంతట; ధరణీధవుడున్ = రాజుకూడ {ధరణీధవుడు - ధరణి (భూమికి) ధవుడు (భర్త), రాజు}.

భావము:

ఆ ప్రకారంగా క్రమక్రమంగా పృథువు మొదలైనవారు వేరువేరు వత్సములను, పాత్రలను కల్పించుకొని తమతమ కోర్కెలనే వేరువేరు క్షీరాలను పిదుకుకున్నారు. అప్పుడు పృథుమహారాజు...