పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-489-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విరులు గందకుండఁగ
సగతిం బూవుఁదేనెఁ విగొను నిందిం
దివిభు కైవడి బుధుఁడగు
పురుషుఁడు సారాంశ మాత్మఁబూని గ్రహించున్.

టీకా:

ధరన్ = ప్రపంచములో; విరులున్ = పూవులు; కందకుండగ = కందిపోకుండా; సరస = సున్నితమైన; గతిన్ = విధముగ; పూవుదేనెన్ = మకరందమును; చవిగొనున్ = తాగెడి; ఇందిందిరవిభున్ = గండుతుమ్మెద; కైవడిన్ = వలె; బుధుడు = జ్ఞాని; అగు = అయిన; పురుషుడు = మానవుడు; సారాంశమున్ = అవసరమైనదానిని; ఆత్మన్ = మనసున; పూని = పూనుకొని; గ్రహించున్ = సంపాదించుకొనును.

భావము:

పువ్వులు కందకుండా లోపలి తేనెను మృదువుగా తాగే తేనెటీగ మాదిరి సుజ్ఞాని దేనిని నొప్పించకుండా సారాంశాన్ని, కావలసిన దానిని నేర్పుగా గ్రహిస్తాడు.
క్రోధంతో కాదు ఉపాయంగా కావలసినవి సాధించాలి అంటు పృథు చక్రవర్తితో భూదేవి చెప్తోంది