పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువోపాఖ్యానము

  •  
  •  
  •  

4-221-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యీ రీతి నసహ్యవ
ములు పినతల్లి యపుడు నకుఁడు వినగాఁ
ను నాడిన దుర్భాషా
శరములు మనము నాఁటి కాఱియపెట్టన్.

టీకా:

అని = అని; ఈ = ఈ; రీతిన్ = విధముగ; అసహ్య = సహింపరాని; వచనములు = మాటలు; పినతల్లి = పినతల్లి; అపుడు = అప్పుడు; జనకుడు = తండ్రి; వినగాన్ = వింటుండగ; తనున్ = తనను; ఆడిన = అనిన; దుర్భాషా = తిట్లు అనెడి; ఘన = పెద్ద; శరములన్ = బాణములు; మనమున్ = మనసున; నాటి = తగిలి; కాఱియపెట్టన్ = బాధపెట్టగా.

భావము:

అని ఈ విధంగా తండ్రి వింటూ ఉండగా పినతల్లి సురుచి పలికిన వాక్యాలను ధ్రువుడు సహించలేకపోయాడు. ఆమె నిందావాక్యాలు బాణాలవలె అతని మనస్సులో నాటుకొని పీడించగా...