పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-127-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లితఁ దదీయ సుందర విలాస విమోహితలైన వారినిం
బొసిన గోర్కిఁదీర్చుటకు నొక్కముహూర్తమునన్ వరించి క
న్య లలితావరోధభవనంబుల నందఱ కన్నిరూపులై
సి సుఖస్థితిం దనిపెఁ గాంతల భక్తినితాంతచిత్తలన్.

టీకా:

లలితన్ = సౌకుమార్యముతో; తదీయ = అతని; సుందర = అందమైన; విలాస = శృంగారములకు; విమోహితులు = బాగా మోహింపబడిన వారు; ఐన = అయినట్టి; వారినిం = వారిని; పొలసిన = వికసించిన; కోర్కిన్ = కోరికను; తీర్చుటకున్ = తీర్చుటకోసము; ఒక్క = ఒక్క; ముహూర్తమునన్ = సమయమున; వరించి = పెండ్లాడి; కన్యలన్ = కన్యలను; లలిత = అందమైన; అవరోధభవనంబులన్ = అంతఃపురములలో; అందఱ = అందర; కున్ = కు; అన్ని = అన్ని; రూపులు = స్వరూపములు కలవాడు; ఐ = అయి; కలసి = కూడి; సుఖ = సుఖమైన; స్థితిన్ = స్థితులలో; తనిపెన్ = సంతృప్తులజేసె; కాంతలన్ = స్త్రీలను; భక్తి = భక్తితో; నితాంత = పూర్తిగ నిండిన; చిత్తలన్ = మనసులు కలవారిని.

భావము:

. తన సౌందర్యవిలాసాలకు వ్యామోహం చెందిన ఆ పదహారువేల నూరుగురు సుందరీమణుల కోర్కె తీర్చుటకోసం, అందాలరాశి నందనందనుడు అయిన కృష్ణుడు ఒక్క సుముహూర్తలోనే వారందరినీ పెండ్లాడాడు. అత్యంత మనోహరాలైన అంతఃపురాలలో అందరికీ అన్ని రూపులు ధరించిన వాడై, అంతులేని అనురాగంతో నిండిన మనసులు గల ఆ కాంతామణులను సంతోషపరచాడు.