పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ మానస సర్గంబు

  •  
  •  
  •  

3-338-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రఁగ సుధాశన తిర్య
ఙ్న వివిధస్థావరాది నానాసృష్టి
స్ఫుణ నజుం డొనరించెం
రువడి నిష్కామధర్మలరూపమునన్.

టీకా:

పరగన్ = ప్రసిద్ధి చెందునట్లు; సుధాశన = దేవతలు {సుధాశన - సుధ (అమృతము) ను ఆశన (తాగు) వారు, దేవతలు}; తిర్యక్ = జంతువులు {తిర్యక్ – చలనము కలవి, జంతువులు}; నర = నరులు; వివిధ = అనేక రకముల; స్థావర = వృక్షములు {స్థావరములు – చలనము లేనివి, వృక్షాదులు}; ఆది = మొదలగు; నానా = అనేక రకములుగ; సృష్టిన్ = సృష్టిని; స్పురణన్ = తెలియునట్లు, స్పృహతో; అజుండు = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మములు లేనివాడు, బ్రహ్మదేవుడు}; ఒనరించెన్ = చేసెను; పరువడి = క్రమముగా; నిష్కామ = కోరికలు లేని; ధర్మ = ధర్మమునకు; ఫల = ఫలితము అయిన; రూపమునన్ = విధముగ.

భావము:

ప్రతిఫలం, ఆశించని తన పరమధర్మానికి, ఫల స్వరూపముగా, దేవతలు, పశు పక్ష్యాదులు, మానవులు ఇంకా అనేక రకాలైన స్ధావరాలు మొదలైన వాటితో కూడిన నానావిధాలైన సృష్టిని క్రమంగా బ్రహ్మదేవుడు కొనసాగించాడు.