పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : వైకుంఠపుర వర్ణనంబు

  •  
  •  
  •  

2-232-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీయ రూపరేఖా
ణీయతఁ జాల నొప్పు మణీమణి య
క్కలాలయ దన మృదు కర
లంబుల విభుని పాదమలము లొత్తెన్.

టీకా:

కమనీయ = మనోహరమైన; రూప = రూపము; రేఖ = సౌష్టవముల; రమణీయతఁన్ = మనోఙ్ఞతతో; చాలన్ = మిక్కిలి; ఒప్పు = చక్కగ ఉన్న; రమణీ = స్త్రీ; మణి = రత్నము; ఆ = ఆ; కమలాలయ = లక్ష్మీదేవి {కమలాలయ - కమలములు ఆలయముగ కలది, లక్షీదేవి}; తన = తన యొక్క; మృదు = మృదువైన; కర = చేతులు అను; కమలంబులన్ = పద్మములతో; విభుని = ప్రభువు (విష్ణుమూర్తి); పాద = పాదములు అను; కమలములు = పద్మములు; ఒత్తన్ = ఒత్తుచుండగ.

భావము:

చక్కని రూపరేఖావిలాసాలతో చక్కగా ఒప్పి వున్న లక్ష్మీదేవి, తన కోమలమైన పాణి పద్మాలతో ప్రాణేశ్వరుని పాదపద్మాలను ఒత్తుతున్నది.