పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నరనారాయణావతారంబు

  •  
  •  
  •  

2-131-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నారాయణుఁ డప్పుడు దన
యూరువు వెసఁ జీఱ నందు నుదయించెను, బెం
పారంగ నూర్వశీ ముఖ
నారీజనకోటి దివిజనారులు మెచ్చన్.

టీకా:

నారాయణుఁడు = నారాయణుడు; అప్పుఁడు = అప్పుడు; తన = తన; ఊరువున్ = తోడను; వెసన్ = వేగముగ; చీఱగన్ = గీరగా, గోకగా; అందున్ = అందువలన; ఉదయించెన్ = పుట్టెను; పెంపు = గొప్పతనము; ఆరంగన్ = మించుతుండగ; ఊర్వశీ = ఊర్వశియు; ముఖ = మొదలగు; నారీ = స్త్రీ; జన = జనముల; కోటి = సమూహము; దివిజ = దేవతా; నారులు = స్త్రీలు; మెచ్చన్ = మెచ్చుకోగా.

భావము:

అప్పుడు నారాయణుడు తన ఊరు భాగాన్ని గోటితో వేగంగా గీరాడు. అతని తొడలోనుండి అమరాంగనలు అచ్చెరువొందేలా ఊర్వశి మొదలైన అప్సరస స్ర్తీ సమూహం ఉద్భవించింది.