పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : యదు వృష్ణి భో జాంధక వంశంబు

  •  
  •  
  •  

10.2-1338-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యిట్లు బాదరాయణి
మున రాగిల్ల నాభిన్యునకుం జె
ప్పి విధమున సూతుఁడు ముని
నుల కెఱింగింప వారు మ్మతితోడన్.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; బాదరాయణి = శుకమహర్షి {బాదరాయణి - బదరీవనమున ఉండువాని (బాదరాయణుని) కొడుకు, శుకుడు}; మనమునన్ = మనసునందు; రాగిల్లన్ = రంజిల్లునట్లు; ఆభిమన్యు = పరీక్షిన్మహారాజున {ఆభిమన్యుడు - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిత్తు}; కున్ = కు; చెప్పిన = చెప్పినట్టి; విధమునన్ = రీతిని; సూతుడు = సూతమహర్షి; ముని = ఋషి; జనుల = సమూహమున; కున్ = కు; ఎఱిగింపన్ = తెలియజెప్పగా; వారు = వారు; సమ్మతి = ఇష్టము; తోడన్ = తోటి.

భావము:

ఈరీతిగా శుకమహర్షి పరీక్షన్మహారాజు మనసు రంజిల్లేలా చెప్పిన ప్రకారంగా సూతుడు శౌనకాది మహామునులకు ప్రవచించాడు. వారెంతో సంతోషించారు.