పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సుభద్రా పరిణయంబు

  •  
  •  
  •  

10.2-1171-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుణీశిరోమణియు ర్జును, నర్జునచారుకీర్తి వి
ఖ్యాతుని, నింద్రనందను, నల్మషమానసుఁ, గామినీ మనో
జాతునిఁ జూచి పుష్పశర సాయకజర్జరితాంతరంగయై
భీతిలి యుండె సిగ్గు మురిపెంబును మోహముఁదేఱు చూపులన్.

టీకా:

ఆ = ఆ; తరుణీ = యువతీ {తరుణి - తరుణ వయస్కురాలు, యువతి}; శిరోమణియున్ = శ్రేష్ఠురాలు; అర్జునున్ = అర్జునుని {అర్జునుడు - తెల్లనివాడు}; అర్జున = తెల్లని; చారు = చక్కటి; కీర్తిన్ = కీర్తికలవానిని; విఖ్యాతుని = మిక్కిలి ప్రసిద్ధుని; ఇంద్రనందనున్ = ఇంద్రపుత్రుని; అకల్మషమానసున్ = నిర్మలమైన మనసు కలవానిని; కామినీమనోజాతుని = స్త్రీలకి మన్మథుడైన వాని; చూచి = చూసి; పుష్పశర = మన్మథుని; సాయక = బాణములచేత; జర్జరిత = తూట్లుచేయబడిన; అంతరంగ = మనసు కలది; ఐ = అయ్యి; భీతిలి = బెదురు కలిగి; ఉండెన్ = ఉండెను; సిగ్గు = సిగ్గు; మురిపెంబును = కులుకులు; మోహము = మోహము; తేఱు = తోపించు; చూపులన్ = చూపులతో.

భావము:

దేవేంద్ర తనయుడు; స్వచ్ఛమైన యశోవిరాజితుడూ; నిర్మలహృదయుడూ; మానినీ మనోహరుడు; అయిన అర్జునుడిని చూసి సుభద్ర మరుని శరపరంపరకు లోనై కలవరపడింది. సిగ్గూ మురిపెమూ మోహమూ ఎక్కువ అయి ఆ తరుణీమణి చూపులలో ప్రతిఫలిస్తున్నాయి.