పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : వసుదేవుని గ్రతువు

  •  
  •  
  •  

10.2-1123-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్మునీశ్వరులకు నానకదుందుభి-
తిభక్తి వందనం బాచరించి
"తాపసోత్తములార! ర్మతత్త్వజ్ఞులు-
న్నించి వినుఁడు నా విన్నపంబు
త్కర్మ వితతిచే సంచితకర్మ చ-
యంబు వాపెడు నుపాయంబు నాకు
న దయామతిఁ జెప్పుఁ" నిన న మ్మునివరుల్‌-
భూరుల్‌ విన వసుదేవుఁ జూచి

10.2-1123.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యెలమిఁ "బలికిరి నిఖిల యజ్ఞేశుఁ డైన
మలలోచనుఁ గూర్చి యాములు సేయు;
ర్మమునఁ బాయు నెట్టి దుష్కర్మ మైన;
నిదియె ధర్మంబు గాఁగ నీ దిఁ దలంపు.

టీకా:

ఆ = ఆ; ముని = ఋషి; ఈశ్వరుల్ = ఉత్తములు; కున్ = కు; ఆనకదుందుభి = వసుదేవుడు {ఆనకదుందుభి - జననకాలమునందు దివ్యమైన ఆనక (తప్పెటలు మద్దెల) దుందుభి (భేరీ)లు మోగినవాడు, వసుదేవుడు}; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; వందనంబున్ = నమస్కారములు; ఆచరించి = చేసి; తాపస = ఋషి; ఉత్తములారా = ఉత్తములారా; ధర్మతత్వజ్ఞులు = ధర్మస్వరూప మెరిగిన వారు; మన్నించి = అనుగ్రహించి; వినుడు = వినండి; నా = నా యొక్క {ఆగామి ప్రారబ్ధ సంచిత}; విన్నపంబున్ = మనవిని; సత్ = ఉత్తమములైన; కర్మ = యాగాది క్రియల; వితతి = సమూహము; చేన్ = చేత; సంచిత = జన్మజన్మల కూడిన; కర్మ = కర్మల ప్రభావముల; చయంబు = సమూహములు; వాపెడు = తొలగెడి; ఉపాయంబు = ఉపాయము; నా = నా; కున్ = కు; ఘన = గొప్ప; దయా = కృప గల; మతిన్ = మనస్సుతో; చెప్పుడు = చెప్పండి; అనినన్ = అనగా; ఆ = ఆ; ముని = ఋషి; వరుల్ = ఉత్తములు; భూవరుల్ = రాజులు; వినన్ = వినుచుండగా; వసుదేవున్ = వసుదేవుడుని; చూచి = ఉద్దేశించి.
ఎలమిన్ = ప్రీతితో; పలికిరి = చెప్పిరి; నిఖిల = సమస్తమైన; యజ్ఞ = యాగములకు; ఈశుడు = ప్రభువు; ఐన = అయిన; కమలలోచనున్ = విష్ణుమూర్తిని; గూర్చి = గురించి; యాగములు = యజ్ఞములు; చేయు = చేసెడి; కర్మమునన్ = కార్యములచేత; పాయున్ = తొలగును; ఎట్టి = ఎటువంటి; దుష్కర్మము = పాపము; ఐనన్ = అయినను; ఇదియె = ఇదే; ధర్మంబు = యుక్తమైన పని; కాగన్ = అయినట్లు; నీ = నీ; మదిన్ = మనస్సునందు; తలంపు = తలచుము.

భావము:

వసుదేవుడు ఆ మహర్షులకు నమస్కారం చేసి, “ఋషివరులారా! మీరు ధర్మతత్వజ్ఞులు. క్షమించి నా మనవి ఆలకించండి. సత్కర్మల ద్వారా పూర్వజన్మ కర్మలను పోగొట్టుకునే ఉపాయం నాకు దయతో తెలియ జెప్పండి.” అని ప్రార్థించాడు. అప్పుడా మునీశ్వరులు రాజులు అందరూ వింటూండగా వసుదేవునితో ఇలా అన్నారు. “ఈ శ్రీకృష్ణుడు సమస్త యజ్ఞాలకూ అధీశ్వరుడు; ఈ పుండరీకాక్షుడి గురించి చేసే యాగం వలన ఎలాంటి దుష్కర్మమైనా తొలగిపోతుంది. దీన్నే ధర్మంగా గ్రహించు.