పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కుచేలుని ఆదరించుట

  •  
  •  
  •  

10.2-987-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మృదుతల్పమందు వనితామణి యైన రమాలలామ పొం
దును నెడఁగాఁ దలంపక యదుప్రవరుం డెదురేఁగి మోదముం
నుకఁగఁ గౌఁగిలించి యుచిక్రియలం బరితుష్టుఁ జేయుచున్
వియమునన్ భజించె; ధరణీసురుఁ డెంతటి భాగ్యవంతుడో? "

టీకా:

తన = తన యొక్క; మృదు = మెత్తని; తల్పము = మంచము; అందున్ = మీద; వనితా = స్త్రీ; మణి = శ్రేష్ఠురాలు; ఐన = అయినట్టి; రమాలలామ = రుక్మిణీదేవి; పొందును = కూడికను; ఎడగాన్ = దూరమగుటను; తలంపక = ఎంచకుండ; యదుప్రవరుండు = కృష్ణుడు {యదుప్రవరుడు - యదు వంశావళిలోని వాడు, కృష్ణుడు}; ఎదురేగి = ఎదురుగా వెళ్ళి; మోదమున్ = సంతోషము; తనుకగన్ = కలుగగా; కౌగలించి = ఆలింగనము చేసికొని; ఉచిత = తగిన; క్రియలన్ = పరిచర్యలచేత; పరితుష్టున్ = మిక్కిలి తృప్తి చెందినవాని; చేయుచున్ = చేస్తూ; వినయమునన్ = వినయముతో; భజించెన్ = సేవించెను; ధరణీసురుడు = బ్రాహ్మణుడు; ఎంతటి = ఎంత గొప్ప; భాగ్యవంతుడో = అదృష్టవంతుడోకదా.

భావము:

తన మృదుతల్పం మీద ఉన్న రుక్మిణీదేవి సాంగత్యానికి ఎడబాటు అని కూడా చూడకుండా, శ్రీకృష్ణుడు లేచి వెళ్ళి విప్రోత్తమునికి స్వాగతం చెప్పాడు. ప్రేమతో అతడిని కౌగలించుకున్నాడు. సముచితంగా సత్కరించాడు. ఎంతో వినయంగా పూజించాడు. ఇంతటి గౌరవం పొందిన ఈ బ్రాహ్మణోత్తముడు ఎంత అదృష్టవంతుడో కదా.”