పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మజు రాజసూ యారంభంబు

  •  
  •  
  •  

10.2-676-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాస్త్రుఁడు పులు గడిగిన
కుసుమాస్త్రములను హసించు కోమలతనువుల్‌
మిమిస మెఱవఁగ వేశ్యా
విరము దాసీజనంబు విభవ మెలర్పన్.

టీకా:

అసమాస్త్రుడు = మన్మథుడు; పులుకడిగిన = స్వచ్ఛమైన {పులుకడిగిన - పులు (ఆమ్లముతో) (రత్నమాలిన్యము) కడిగిన ముత్యాలు ఆదులు ఉండునంత స్వచ్ఛమైన}; కుసుమ = పూల; అస్త్రములను = బాణములను; హసించు = పరిహసించెడి; కోమల = మృదువైన; తనువుల్ = దేహములు; మిసమిస = మిసమిస అని; మెఱవగన్ = ప్రకాశించగా; వేశ్యా = భోగమువారి; విసరము = సమూహము; దాసీజనంబున్ = సేవకురాళ్ళు; విభవమున్ = వైభవమును; ఎలర్పన్ = పెంపు చేయుచుండగా.

భావము:

పూవిల్తుని స్వచ్ఛమైన పూలబాణాలవంటి మిసమిసలాడే మెత్తని మేనులతో మెఱసిపోయే ఆటవెలదులూ, దాసీ సమూహాలూ వైభవంగా (తోడు వస్తుండగా)...