పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మి బలరాముల జూదంబు

  •  
  •  
  •  

10.2-298-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వుడు హలధరుఁ డచ్చటి
పాలకసుతులఁ జూచి "త్యము పలుకుం"
ని యడిగిన వారలు రు
క్ముని హితులై పలుక రైరి మొగమోటమునన్.

టీకా:

అనవుడున్ = అనగా; హలధరుడు = బలరాముడు {హలధరుడు - నాగలి ఆయుధము ధరించువాడు, బలరాముడు}; అచ్చటి = అక్కడి; జనపాలకసుతులన్ = రాకుమారులను; చూచి = చూసి; సత్యమున్ = నిజము; పలుకుండు = చెప్పండి; అని = అని; అడిగినన్ = అడగగా; వారలు = వారు; రుక్ముని = రుక్మికి; హితులు = కావలసినవారు; ఐ = అయ్యి; పలుకరు = ఏమి చెప్పనివారు; ఐరి = అయ్యారు; మొగమాటమునన్ = మొహమాటముచేత.

భావము:

అప్పుడు బలరాముడు అక్కడ చేరిన రాజులను అందరిని చూసి “నిజం చెప్పం” డని అడిగాడు. వారు రుక్మి మీది పక్షపాతం వలన మొహమాటంతో మౌనం వహించారు.