పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సత్యభామా పరిణయంబు

  •  
  •  
  •  

10.2-83-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నక్కడఁ గుంతీసహితులయిన పాండవులు లాక్షాగారంబున దగ్ధులైరని విని నిఖిలార్థ దర్శనుండయ్యును, గృష్ణుండు బలభద్ర సహితుండై కరినగరంబునకుం జని కృప విదుర గాంధారీ భీష్మ ద్రోణులం గని దుఃఖోపశమనాలాపంబు లాడుచుండె; నయ్యెడ.

టీకా:

అంతన్ = పిమ్మట; అక్కడ = అక్కడ (హస్తినలో); కుంతీ = కుంతీదేవితో; సహితులు = కూడినవారు; అయిన = అగు; పాండవులు = పాండవులు; లాక్ష = లక్క; ఆగారంబునన్ = ఇంటిలో; దగ్ధులు = కాలిపోయిరి; అని = అని; విని = విని; నిఖిల = సర్వ; అర్థ = విషయములు; దర్శనుండు = తెలిసినవాడు; అయ్యును = అయినప్పటికి; కృష్ణుండు = కృష్ణుడు; బలభద్ర = బలరామునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; కరినగరంబున్ = హస్తినాపురమున; కున్ = కు; చని = వెళ్ళి; కృప = కృపుడు; విదుర = విదురుడు; గాంధారీ = గాంధారిని { గాంధారి (గాంధార దేశపు రాజుగు సుబలుని కుమార్తె) }; భీష్మ = భీష్ముడు; ద్రోణులన్ = ద్రోణాచార్యులను; కని = చూసి; దుఃఖ = దుఃఖము; ఉపశమన = తగ్గించెడి; ఆలాపంబులు = పలుకులు; ఆడుచుండెన్ = పలుకుచుండెను; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు.

భావము:

ఇంతలో అక్కడ లక్కఇంటిలో పాండవులు కుంతీ సహితంగా దగ్ధమయ్యారు అని శ్రీకృష్ణుడు విన్నాడు. సర్వము తెలిసిన వాడై కూడా, ఆయన బలరాముడి తోపాటు హస్తినాపురానికి వెళ్ళి కృప, విదుర, గాంధారీ, భీష్మ, ద్రోణులను ఓదార్చాడు