పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాళియ మర్ధనము

  •  
  •  
  •  

10.1-671-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు క్రూరంబులయిన హరిచరణ ప్రహరంబులం బడగ లెడసి నొచ్చి చచ్చినక్రియం బడియున్న పతిం జూచి నాగకాంతలు దురంతంబయిన చింతాభరంబున నివ్వటిల్లెడు నెవ్వగల నొల్లొంబోయి పల్లటిల్లిన యుల్లంబుల.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; క్రూరంబులు = కఠినమైనవి; అయిన = ఐన; హరి = కృష్ణుని; చరణ = పాదముల; ప్రహరంబులన్ = తాకిడిచే; పడగలు = పడగలు; ఎడసి = భగ్నమై; నొచ్చి = నొప్పిని పొందినవాడై; చచ్చిన = చనిపోయినవాని; క్రియన్ = వలె; పడియున్న = పడి ఉన్నట్టి; పతిన్ = భర్తను; చూచి = చూసి; నాగకాంతలు = ఆ కాళియుని భార్యలు; దురంతంబు = అంతులేనిది; అయిన = ఐనట్టి; చింత = విచారము యొక్క; భరంబునన్ = అతిశయముచేత; నివ్వటిల్లెడు = కలిగిన; నెఱ = మిక్కిలి; వగలన్ = దుఃఖముతో; ఒల్లంబోయి = తపించి; పల్లటిల్లిన = తడబడిన, కలవరపడిన; ఉల్లంబుల = మనసులతో.

భావము:

ఈ విధంగా తాండవకృష్ణుడి దారుణమైన పాదాలతాకిడికి పడగలన్ని చితికిపోయి, చచ్చిపోయినవాడిలా పడి ఉన్న తమ భర్త కాళియుని చూసి, అతని భార్యలు ఎంతో శోకించారు. భరించలేని ఆ శోకభారంతో వారి మనస్సులు కలవరపడ్డాయి.