పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాళిందిలో దూకుట

  •  
  •  
  •  

10.1-642-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బాలుం డొక్కఁడు వీఁడు నా మడుఁగు విభ్రాంతోచ్చలత్కీర్ణ క
ల్లోలంబై కలఁగం జరించె నిట నే లోనుంటఁ జూడండు; మ
త్కీలాభీల విశాల దుస్సహ విషాగ్నిజ్వాలలన్ భస్మమై
కూలం జేసెద నేడు లోకులకు నా కోపంబు దీపింపఁగన్."

టీకా:

బాలుండు = పిల్లవాడు; ఒక్కడు = ఒకానొకడు; వీడు = ఇతడు; నా = నా యొక్క; మడుగున్ = హ్రదమును; విభ్రాంత = విభ్రాంతికరమైన; ఉచ్చలత్ = పైకెగసి; కీర్ణ = చెదిరిన; కల్లోలంబు = గొప్ప అలలు కలది; ఐ = అయ్యి; కలగన్ = చెల్లాచెదురు అగునట్లు; చరించెన్ = మెలగెను; ఇట = ఇక్కడ; నేన్ = నేను; లోన్ = లోపల; ఉంటన్ = ఉండుటను; చూడండు = లెక్కజేయడు; మత్ = నా యొక్క; కీలా = మంటలచేత; అభీల = భయంకరమైన; విశాల = విస్తారమైన; దుస్సహ = సహింపలేని; విష = విషము అనెడి; అగ్ని = అగ్ని; జ్వాలలన్ = మంట లందు; భస్మము = బూడిద; ఐ = అయిపోయి; కూలన్ = పడిపోవునట్లు; చేసెదన్ = చేసెదను; నేడు = ఇవాళ; లోకుల్ = లోకములోని అందర; కున్ = కి; నా = నా యొక్క; కోపంబు = రోషము; దీపింప = ప్రకాశించినది; కన్ = అగునట్లు.

భావము:

ఆ కాళియుడు ఇలా అనుకున్నాడు “వీడెవడో ఒక కుఱ్ఱాడు నా మడుగును కల్లోలం చేసి కలచివేస్తున్నాడు. ఎగిసి పడుతున్న అలలతో కళ్ళుచెదిరేలా ఈదేస్తూ ఉన్నాడు. లోపల నేను ఉన్నాననేనా చూడటంలేదు. భయంకరమైన భరింపశక్యంకాని నా విషాగ్నిజ్వాలలతో భస్మంచేసి వీడిని కూల్చేస్తాను. లోకు లందరికి నా కోపం ఎలాంటిదో తెలిసిరావాలి.”