పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : నందుడు వసుదేవుని చూచుట

  •  
  •  
  •  

10.1-200-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ గౌఁగిలించుకొని, సుఖాసీనునింగాఁజేసి, వసుదేవుండు దన కొడుకువలని మోహంబు దీపింప నందుని కిట్లనియె.

టీకా:

మఱియున్ = మరింకను; కౌగలించుకొని = ఆలింగనములు చేసి; సుఖా = సుఖవంతమైన; ఆసీనునిన్ = పీఠంపై కూర్చున్నవాని; కాన్ = అగునట్లు; చేసి = చేసి; వసుదేవుండు = వసుదేవుడు; తన = తన యొక్క; కొడుకు = పుత్రుని; వలని = ఎడలి; మోహంబు = ప్రేమము; దీపింపన్ = ప్రకాశించునట్లుగా; నందుని = నందుడుతో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆవిధంగా నందుని కౌగిలించుకుని, సుఖాసీనుణ్ణి చేసాడు. అప్పుడు వసుదేవుడికి కన్నకొడుకుపై ప్రేమ పొంగింది. అంతట వసుదేవుడు నందునితో ఇలా అన్నాడు.