పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : నందుడు వసుదేవుని చూచుట

  •  
  •  
  •  

10.1-198-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది మొదలు మొదవుల కదుపులు పొదువులు గలిగి యుండె; నంత నందుండు గోపకుల ననేకుల గోకులరక్షకుం దక్షులైన వారిని నియమించి, మథురకుం జని, కంసునకు నేఁటేఁటం బెట్టెడి యరింబెట్టి, వీడ్కొని, వసుదేవుని కడకుం జని, యథోచితంబుగ దర్శించిన.

టీకా:

అది = అప్పటి; మొదలు = నుంచి; మొదవుల = పాడియావుల; కదుపులు = గుంపులు; పొదుపులు = నిండైన పొదుగులు; కలిగి = కలిగి; ఉండెన్ = ఉండెను; అంతన్ = అంతట; నందుండు = నందుడు; గోపకులన్ = గోపాలకులను; అనేకులన్ = అనేకమందిని; గోకుల = గోవులమందలను; రక్ష = కాపాడుట; కున్ = కోసము; దక్షులు = సమర్థులు; ఐనన్ = అయినట్టి; వారిని = వారలను; నియమించి = ఏర్పరచి; మథుర = మథురానగరి; కున్ = కి; చని = వెళ్ళి; కంసున్ = కంసుని; కున్ = కి; ఏటేటన్ = ప్రతి సంవత్సరము; పెట్టెడి = కట్టవలసిన; అరిన్ = కప్పమును, పన్నును; పెట్టి = కట్టి; వీడ్కొని = సెలవు తీసుకొని; వసుదేవుని = వసుదేవుడి; కడ = దగ్గర; కున్ = కు; చని = వెళ్ళి; యథోచితంబుగన్ = తగిన విధముగా; దర్శించినన్ = చూడబోగా.

భావము:

ఆ బాలుడు పుట్టినప్పటి నుండి వ్రేపల్లె లోని ఆలమందలు కుండపొదుగులతో కనులపండుగ చేసాయి. ఒకనాడు నందుడు ఆలమందలను వ్రేపల్లెను రక్షించడానికి నిపుణులైన గోపకులను నియమించాడు. తాను మధురానగరానికి వెళ్ళి, ఏటేటా చెల్లించవలసిన పన్నులను కంసునికి సమర్పించాడు. అతని వద్ద సెలవుతీసుకుని వసుదేవుని దగ్గఱకి వెళ్ళాడు. ఎంతో గౌరవంగా అతనిని దర్శనం చేసుకున్నాడు.