పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంస వధ

  •  
  •  
  •  

10.1-1376-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గమున కెగురు యదు స
త్తగణ్యునిఁ జూచి ఖడ్గరుఁడై యెదిరెం
గమివారలు వీరో
త్తగణవిభుఁ డనఁగఁ గంసరణీపతియున్.

టీకా:

తమగమున్ = మంచెపైకి; ఎగురు = దుముకు; యదు = యదువంశపు; సత్తమ = శ్రేష్ఠులలో; గణ్యునిన్ = ఎన్నదగినవానిని; చూచి = చూసి; ఖడ్గ = కత్తి; ధరుడు = పట్టినవాడు; ఐ = అయ్యి; ఎదిరెన్ = ఎదిరించెను; తమ = వారి యొక్క; గమి = సమూహము; వారలు = వారు; వీర = వీరులలో; ఉత్తమ = శ్రేష్ఠుడు; గణ = రాజ్యమునకు; విభుడు = ప్రభువు; అనగన్ = అనునట్లుగా; కంస = కంసుడు అనెడి; ధరణీపతి = రాజు {ధరణీపతి - రాజ్యమునకు ప్రభువు, రాజు}.

భావము:

తానున్న గద్దెమీదకి ఎగిరి దూకుతున్న యాదవ మహావీరుడు శ్రీకృష్ణుడిని చూసి మథురను ఏలే కంసుడు ఖడ్గాన్ని చేపట్టి ఎదిరించాడు అతని పక్షంలోని వారంతా కంసుడు గొప్పవీరుడైన ప్రభువు అని ప్రశంసించారు.