పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : పౌరకాంతల ముచ్చటలు

  •  
  •  
  •  

10.1-1352-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ సమయంబునం బౌరకాంతలు మూఁకలు గట్టి వెచ్చనూర్చుచు ముచ్చటలకుం జొచ్చి తమలో నిట్లనిరి.

టీకా:

ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయము నందు; పౌర = పురమునందలి; కాంతలు = స్త్రీలు; మూకలు = గుంపులు; కట్టి = కూడి; వెచ్చనూర్చుచుచున్ = వెచ్చిన నిట్టూర్పులతో; ముచ్చటలు = కబుర్లాడుట; కున్ = కు; చొచ్చి = మొదలిడి; తమలోన్ = వారిలోవారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అలా బలరామకృష్ణులు మల్లులతో పోరాడుతున్న సమయంలో మధురలోని మగువలు గుంపులుగా చేరి, వేడి నిట్టూర్పులు విడుస్తూ తమలో తాము ఇలా ముచ్చటించుకున్నారు.