పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కంసు డక్రూరునితో మాట్లాడుట

  •  
  •  
  •  

10.1-1158-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క్రూరత్వముతోడ నీవు మనఁగా క్రూరనామంబు ని
ర్వక్రత్వంబునఁ జెల్లె మైత్రి సలుపన్ చ్చున్ నినుం జేరి నీ
క్రోధుండవు మందలోన బలకృష్ణాభీరు లస్మద్వినా
క్రీడారతులై చరింతురఁట యోజందెచ్చి యొప్పింపవే.

టీకా:

అక్రూరత్వము = క్రూరత్వములేని శీలము; తోడన్ = తోటి; నీవు = నీవు; మనగా = జీవింపగా; అక్రూర = అక్రూరుడు అనెడి; నామంబు = పేరు; నిర్వక్రత్వంబునన్ = సార్థకత్వముతో; చెల్లెన్ = సరిపోయినది; మైత్రి = స్నేహము; సలుపన్ = నెరపుట; వచ్చును = చేయవచ్చు; నినున్ = నిన్ను; చేరి = కూడి; నీవు = నీవు; అక్రోధుండవు = కోపము లేనివాడవు; మంద = వ్రేపల్లె; లోనన్ = అందు; బల = బలరాముడు; కృష్ణ = కృష్ణుడు అనెడి; ఆభీరులు = గోపకులు; అస్మత్ = నా యొక్క; వినాశ = నాశనము అనెడి; క్రీడా = వ్యాపారము నందు; రతులు = ఆసక్తి గలవారు; ఐ = అయ్యి; చరింతురు = మెలగుదురట; యోజన్ = తెలివిగా; తెచ్చి = తీసుకొని వచ్చి; ఒప్పింపవే = ఒప్పజెప్పుము.

భావము:

“క్రూరకృత్యాలకు దిగకుండా బతుకు సాగించడం వలన నీకు అక్రూరుడనే పేరు సార్ధకనామం అయింది. నీతో కలసి మెలసి స్నేహం చేయవచ్చు. నీవు కోపంలేని వాడివి, నందవ్రజంలో గొల్లలైన రామకృష్ణులు నన్ను చంపడానికి ఆసక్తితో సిద్ధపడుతున్నారుట. ఉపాయంతో వారిని తెచ్చి నాకు అప్పగించు.