పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : సర్పరూపి శాపవిమోచనము

  •  
  •  
  •  

10.1-1120-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని విన్నవించి హరికిఁ బ్రదక్షిణంబువచ్చి మ్రొక్కి, సుదర్శనుండు దివంబునకుం జనియె, సర్పంబు వలన నందుండు విముక్తుం డయ్యెఁ; దత్ప్రకారంబు విని వెఱఁగుపడి గోపకులు దేవతామహోత్సవంబు సమాప్తి నొందించి కృష్ణకీర్తనంబు సేయుచు మరల మందకుం జని; రంత.

టీకా:

అని = అని; విన్నవించి = మనవిచేసి; హరి = కృష్ణుని; కిన్ = కి; ప్రదక్షిణంబువచ్చి = ప్రదక్షిణచేసి; మ్రొక్కి = నమస్కరించి; సుదర్శనుండు = సుదర్శనుడు; దివంబున్ = స్వర్గమున; కున్ = కు; చనియె = వెళ్ళిపోయెను; సర్పంబు = పాము; వలన = నుండి; నందుండు = నందుడు; విముక్తుండు = విడువబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; తత్ = ఆ యొక్క; ప్రకారంబున్ = విధమును; విని = విని; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; గోపకులు = గొల్లవారు; దేవతా మహోత్సవంబున్ = జాతరను; సమాప్తినొందించి = పూర్తిచేసి; కృష్ణ = కృష్ణుని; కీర్తనంబు = స్తోత్రములు; చేయుచున్ = చేస్తూ; మరల = తిరిగి; మంద = గొల్లపల్లె; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అంత = అప్పుడు.

భావము:

అని విజ్ఞప్తి చేసి, సుదర్శను కృష్ణుడికి ప్రదక్షిణ నమస్కరాలు చేసి, దేవలోకానికి వెళ్ళిపోయాడు. నందమహారాజు పాము నుంచి విముక్తుడయ్యాడు. ఇలా శ్రీకృష్ణుని వలన సుదర్శన విద్యాధరుడి శాపవిమోచనం జరగడం చూసి గోపకులు ఆశ్చర్యపోయారు. దేవతా జాతర పూర్తి చేసుకొని దేవకీసుతుని స్తుతిస్తూ తిరిగి గోకులానికి వెళ్ళిపోయీరు.