పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికలకు నీతులు చెప్పుట

  •  
  •  
  •  

10.1-983-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నితలు! నన్నుఁ గోరి యిట చ్చితి, రింతఁ గొఱంత లేదు మే
లొరె; సమస్త జంతువులు నోలిఁ బ్రియంబులుగావె? నాకు నై
ను నిలువంగఁ బోలదు, సనాతన ధర్మము లాఁడువారికిం
బెనిమిటులన్ భజించుటలు పెద్దలు చెప్పుచు నుందు రెల్లెడన్.

టీకా:

వనితలు = ఓ ఇంతులు; నన్నున్ = నన్ను; కోరి = కలియగోరి; ఇటన్ = ఇక్కడకు; వచ్చితిరి = వచ్చినారు; ఇంతన్ = ఇంతవరకు; కొఱంత = అకార్యము, తక్కువైనది; లేదు = కాదు; మేలు = మంచి; ఒనరెన్ = జరిగినది; సమస్త = ఎల్ల; జంతువులున్ = జీవులు; ఓలిన్ = తప్పక; ప్రియంబులు = ఇష్టమైనవి; కావె = కావా, అగును; నా = నా; కున్ = కు; ఐనను = అయినప్పటికిని; నిలువంగన్ = ఇక్కడ ఉండిపోవుట; పోలదు = తగదు; సనాతన = పూర్వ; ధర్మములున్ = సంప్రదాయములు; ఆడువారికిన్ = స్త్రీలకు; పెనిమిటులన్ = భర్తలను; భజించుటలు = సేవించుట; పెద్దలు = పెద్దలు; చెప్పుచునుందురు = చెప్తుంటారు; ఎల్లెడలన్ = ఎల్లప్పుడు.

భావము:

ఓ మగువలారా! నన్ను కోరి మీరిక్కడికి వచ్చారు దీంట్లో ఏమాత్రం కొరత లేదు. ఇది సరైన పనే. సకల ప్రాణులూ నాకు ప్రియమైనవే. కానీ, మీరిచట ఉండిపోకూడదు. పడతులకు పతి పరిచర్యయే ధర్మం ఎక్కడైనా పెద్దలు ఇలాగే చెప్తారు.