పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : భీష్మనిర్యాణంబు

  •  
  •  
  •  

1-229-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నము లపహరించి నతోడఁ జెనకెడు
నాతతాయి జనుల ని వధించి
బంధు మరణ దుఃఖ రమున ధర్మజుఁ
డెట్లు రాజ్యలక్ష్మినిచ్చగించె?""

టీకా:

ధనములు = ధనములను; అపహరించి = దొంగిలించి; తన = తన; తోడన్ = మీద; చెనకెడు = గొడవచేయువారు; ఆతతాయి = హత్యలు చేయువారైన; జనులన్ = మానవులను; అనిన్ = యుద్ధములో; వధించి = సంహరించి; బంధు = బంధువుల; మరణ = మరణమువలన కలిగెడు; దుఃఖ = బాధ యొక్క; భరమున = భారముతో; ధర్మజుఁడు = ధర్మరాజు; ఎట్లు = ఏవిధముగ; రాజ్యలక్ష్మిన్ = రాజ్యమును; ఇచ్చగించె = అంగీకరించెను.

భావము:

తన సిరిసంపదలన్నీ అపహరించి తనతో యుద్ధానికి సిద్ధమైన దుర్మార్గపు ఆతతాయిలను (ఇంటికి నిప్పు పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తితో నరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల నపహరించేవాడు, ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరారుగురుని ఆతతాయి అంటారు) సమరంలో సంహరించిన ధర్మరాజు చుట్టాలందరు మరణించారనే దుఃఖభారంతో కూడి ఉండి ఈ రాజ్యభారాన్ని భరించటానికి ఏ విధంగా అంగీకరించాడు అని అడిగాడు.