బాల ద్విపద భాగవతం : భాగం - 5-201-300
201
సోఁకిసోఁకని యంత చువ్వన నెగసె
యాఁకగానక[35] బండి యటు ధాత్రిఁ గూలె
అదిగాంచి నందుండు నతని కాంతయును
ముదమునం దనయుని ముద్దాడి రపుడు
తృణావర్త భంజనము
ప్రకటంబుగా నందభామ యా శౌరి
కొకనాడు చన్నిచ్చుచుండి యతండు
సర్వతోపమఁ జాలబరువయి తోఁప
నుర్విపై నిడునంత నుద్ధతుండైన
అసుర తృణావర్తుఁడను నాతఁ డొక్కఁ
డసమ వేగత వచ్చి యాశౌరి నెత్తి
కొనిచని యాతండు కుత్తిక యురియఁ
బెనఁగొని కరముల బిగియంగఁ బట్టి
బరువయి వ్రేలిన భరియింప లేక
పొరిఁబొరి లోచనంబులు వెలికుఱికి
అవ్యక్త రావుఁడై యాపల్లె నడుమ
పవ్యాహతాద్రినాఁ[36] బడియుండు నంత
వ్రేతెలెత్తుక వచ్చి వేడ్క యశోద
కాతెఱం గెఱిఁగించి యర్పించి రతని
వసుదేవునిచే పంపబడిన గర్గ మహర్షి రహస్యముగా వచ్చి బాలకులిద్దఱికి రామకృష్ణులని నామకరణము చేయుట
ఆలోన గర్గుఁ డత్యంత గూఢముగ
ధీలాలితుఁడు వసుదేవుండు వనుప
[35] ఆకగొనక- అడ్డులేకుండ
[36] పవ్యాహతాద్రి- వజ్రాఘాతంతిన్నపర్వతం
211
నరుదెంచి నందుచే నర్చితుండగుచు
తిరముగా రోహిణిదేవకీ సుతుల
రామకృష్ణు లటంచు రహిఁ బేరు వెట్టి
శ్రీమించ నేఁగె వచ్చిన విధంబునను
బలరామకృష్ణుల బాల్యదశా వర్ణనము
ఆరామకృష్ణులు నంత జిత్తముల
కారూఢి వాత్సల్య మభివృద్ధినొంద
నందుఁడు నతని కాంతయుఁ దమ్ము మిగుల
నందంద లాలింప నసమానులగుచు
పెరిగిరి కళల శోభిల్లి యొండొరుల
దొరయుచు విదియ చందురుని చందమున
కడుఁగోమలములైన కరములఁ బట్టి
యడుగుఁ దమ్ములుఁ దచ్చియాడు చందములు
తగబోరగిలఁబడి తల యించుకించు
కెగయెంగ వణుఁకుచు నెత్తు మార్గములు
కొట్టుకొట్టు మటంచుఁ గూర్మిఁ జంకెనలు
చుట్టుఁబల్కెడు వారిఁ జూచులాగులును
అన్నమా యమ్మ ర మ్మనినఁ జేతులకు
నన్నెగాఁ జయ్యనవచ్చు రీతులును
పరికింపఁ గన్నులపండువుగాఁగ
వరుస వర్థిల్లి రా వసుదేవ సుతులు
221
అల్లారుముద్దని యనిశంబు వ్రేతె
లెల్లభంగులఁ దన్ను నెత్తిముద్దాడ
వుల్లాసమునఁ గృష్ణుఁ డొప్పులుఁదేర
నల్లనల్లన తప్పటడుగులు వెట్టె
గంటలు మువ్వలు గలయంగ మొఱయ
ధంటయై తిరుగు బాంధవు లర్థిబొదల
మట్టిని తినినాడన్న నెపముతో చిన్నికృష్ణుఁడు యశోదకు తన నోటిలో బ్రహ్మాండ భువన భాండములు ప్రదర్శించుట
తనతోడి బాలురుం దాను రాముఁడును
వనజాక్షుఁ డీ రీతివర్తించు వేళ
యిదెమృత్తుఁదినియె నియ్యెడఁ గృష్ణుఁ డనుచు
నుదిరి బాలకులెల్ల నొక్కటం బలుక
వచ్చితన్నా నందవనిత యదల్ప
యెచ్చోటఁ దింటి లేదిదె చూడు మనుచు
తిరువాకుఁ దెఱచి యాదేవదేవుండు
కరుణ ముజ్జగమునుం గనఁబడఁజేసె
అదిచూచి యా యింతి హరి యీతఁ డనుచు
మదిమెచ్చునంతలో మాయచేఁ గప్పి
అప్పుడతనుఁ బుత్రుఁడను తొంటి బుద్ధి
తప్పక యయ్యశోదకుఁ బుట్టఁజేసె
యశోదానందులు పూర్వజన్మలలో నెవరెవరో కయోగి పరీక్షితునకుఁదెల్పుట
“అనఘాత్ముఁడగు ద్రోణుఁడను నట్టి వసువు
ననువొప్పఁ దర యనునతని కాంతయును
231
హరియందు పరభక్తి యలరెడునట్లు
వరము పితామహువలనఁ బ్రాపించి
నందుండు నతని యానాతియు నగుచు
నిందువంశవతంస! యిలఁ బుట్టి రిటుల
అదిగాన యిట్టి భాగ్యము సమకూరె
ముదిత యశోదకు ముదమొప్ప వినుము”
బాలకృష్ణుని దుశ్చేష్టలకు విసిగి తల్లి యశోద వానిని యెట్టకేలకు రోలుకు కట్టి వేయుట
సతిగోపి యొకనాడు చన్నిచ్చి యిచ్చి
ప్రతిలేని తొడలపైఁ బఱఁగెడు తన్ను
అటుడించి పాలపొంగార్చుట కేగ
నటునిటుఁజూచి చయ్యనఁ గోపమొదవి
గట్టిగా నొక యులూఖలము పై నెక్కి
యుట్టిమీదటి వెన్నయొక క్రోఁతి కొసఁగ
ఆవెడ బాలుని యాచందమెల్ల
భావించి నందునిభామ యేతెంచి
పట్టికట్టెద నని బాలుని నడిమి
కెట్టితాళ్ళునుఁ జాలకెదురులు వెట్టి
అలసె, నబ్బాలుండు నాయమ్మ మీది
బలువగు కృపఁ గట్టుపడఁ జిత్తగించె
వనితయు నప్పు డావనజలోచనుని
నొనరెంగ బంధించె నొక రోలి తోడ
రోలు నీడ్చుకొనుచు బాలకృష్ణుఁడు రెండు మద్దిచెట్లను గూల్చి కుబేర కుమారులకు శాపవిమోచనము కల్పించుట
241
రాజేంద్ర! విను కుబేరకుమారులగుచు
రాజిల్లు వారలు రమణీయ యశులు
నలువు మించిన యట్టి నలకూబరుండు
అలరు మణిగ్రీవుఁ డనువాఁడు మున్ను
వెలఁదులతోఁ గూడి వివసనులగుచు
జలకేళి నుండు నాసరణికి నలిగి
యిపుడు వృక్షంబులై యిలఁ బుట్టుఁ డనుచు
శపియించె నారదసంయమీంద్రుండు
అయ్యెడ నందుని యాపల్లె నడుమ
నయ్యిద్దరును మద్దులైపట్టి రెలమి
ఆమద్దులకు శాపమటు వాయఁజేయు
ప్రేమజనించి యాకృష్ణుఁ డవ్వేళ
పనుల వెంట యశోద భవనంబులోన
[37]అనువేదితం బరాకైయుండు నంత
గరిమతోఁ దను నంటఁగట్టిన రోలు
నరనాథ! మద్దులనడిమికి నీడ్చె
తొడిఁబడ రోలు మద్దులఁ దగులించి
కడిమి నీడ్చుటయును గడగడవణఁకి
అమడ మద్దులు వేగ నవనిపై వ్రాలి
తమతొంటి గుహ్యకత్వము ధరియించి
[37] అనువేదితము- ఇంటిపనులలో మునుగుట
251
శాపవిముక్తులై శౌరినిం బొగడి
యేపుమైఁ దమ చోటికేగి రా ఘనులు
బాలకృష్ణునికి దినదినగండముగా గడచు బృహన్నామ విపినమును విడిచి నందాదులు యమునాతీర మందలి గోవర్థన గిరి చెంత గల బృందావనమున స్థిరపడుట
ఆరవంబున కుల్కి యచటికి నందుఁ
డారయు తలఁపున కరిగి వీక్షించి
తనయుని నెత్తుక తన గృహంబునకుఁ
జనుదెంచె నంత నచ్చట నివ్విధమున
కలుగు మహోత్పాతగణముల వలన
వులికి యా నెలవున నుండంగ వెఱచి
యపుడు నందోపనం దాది గోపకులు
విపుల బృహన్నామ విపినంబు విడిచి
ఉరుతర గోవిహారోచిత స్థలము
వరయమునా తీర వర్ణ్యంబు నగుచు
అలరెడు గోవర్థనాద్రికిఁ జెంతఁ
బెలయుచు సరి లేని బృందావనమున
మునుముట్ట మండలమూక లేర్పరచి
వొనరఁ బల్లియఁ గట్టుకుండి రందఱును
వత్సముగా, కొంగగా, అజగరముగా వచ్చిన దైత్యులను బాలకృష్ణుఁడు సంహరించుట
బలకృష్ణు లచట గోపాల బాలకులఁ
గలసి లేఁగలఁ గానఁ గడఁగిరి వేడ్క
వొకదైత్యుఁ డొక్కనాడొక వత్సమగుచుఁ
బ్రకటించి వచ్చిన భావించి తెలిసి
261
వెనక కాళ్ళాగిఁ బట్టివెలగిఁగొట్టి[38]
చనఁజేసె వాని నా జలజలోచనుఁడు
మఱియొక నాడొక మత్తదైత్యుండు
మెఱయుచుఁ గొంగయై మెలగంగఁ జూచి
కొయ్యచంచువున రేకులు రెండుఁ బట్టి
వ్రయ్యలుగాఁ జేసెవాని నిర్జించి
అజగరంబై యొక్కయసుర మార్గమున
నిజమూర్తి నా మడ నిడు పాదరించి
వదనంబుఁ దెఱచుక వరలుచు నుండ
నిదియది యని మదినెఱుగంగ లేక
వత్సపాలకులెల్ల వాని వక్త్రంబు
వత్సయుక్తంబుగా వరుసఁ జొచ్చుటయు
నెఱగి కృష్ణుండు నందేపునం జొచ్చి
యఱిముఱిఁ గుతికకు నడ్డమై నిలిచి
పెద్దగాఁ దన మేనుపెంచిన నిండ
లిద్దిఁగొట్టిన యట్టిలీలమై యసుర
కడుపుబ్బరించి నిర్గత జీవుఁడయ్యె
వెడలించె శిశువత్స వితతుల హరియు
బ్రహ్మ తన మహత్త్వమును చూపుటకై గోగోపవత్సముల నదృశ్యమొనర్చుట
గోపాలకుల బాలకుల తోడఁ గూడి
యాపద్మదళనేత్రుఁ డపు డవ్వనమున
a href="#_5_బాభా-టీక38" name="_5_బాభా-38">[38] వెలగిగొట్టు- వెలచు (శుభ్రపరచుటకు రాతిపై కొట్టినట్లు) కొట్టు
271
చతురత నొక్క కాసారంబు దరిని
కుతుకంబుతోఁ జల్దిగుడుచుచు నుండి
తనక్రేపు లెందేని తలఁగి పోవుటయు
చనివాని వెదకి యెచ్చటఁ గనలేక
చాలించి క్రమ్మఱఁ జనుదెంచి తనదు
బాలురుఁ గానంగఁబడక యుండుటయు
తనమహత్త్వ మెఱుఁగ దలఁచి పద్మజుఁడు
పనివడి దాఁచినపగిది భావించి
గోవత్సములు బాలకులుఁ దాన యగుచు
తావారిఁ దొంటిచందమునఁ దోడ్కొనుచు
పల్లెకుం జనిన నేర్పడ వారి వారి
తల్లులా వచ్చిన తనయులం జూచి
మున్నిటి కంటెను ముప్పిరిఁగొనిన
సన్నుత వాత్సల్యసరణిఁ గైకొనిరి
ఆవులు నట్టి మాయావత్సకముల
సావితోఁ జేరి ముచ్చట పడినాకి
కడుఁజేఁపు దిగి తొంటిగతి దాఁట పాలు
కడవల కొలఁదిగాఁ గ్రమ్మనం బిదికె
శౌరిసేసిన మాయసాగి గూఢముగ
నీరీతి నొక్క యేఁడేగిన నంత
281
తనకు నక్కాల మంతయుఁ దృటి యగుచుఁ
జనుటచే నలువ యుత్సాహంబు తోడ
సృష్టికర్తకే తండ్రియైన శౌరి ముందు బ్రహ్మ తన తప్పిదమును గుర్తించి క్షమాపణ కోరుట
తెలియంగ నరుదెంచి దివమున నిల్చి
తెలివొందు నవ్వనదేశంబు నందు
గోవత్స బాల యుక్తుండయి తొంటి
ఠేవనే శౌరి చూడ్కికి వింతయైన
కనుఁగొని మఱియునుఁ గనుఁగొనునంత
వనజాక్ష మూర్తులై వత్స బాలకులు
కనఁబడ నుదిరి డగ్గరునంత వానిఁ
గనరాని వానిఁగాఁ గావించె శౌరి
అంతఁబద్మాసనుం డరుదెంచి శౌరి
కంతంతఁ బ్రణతుఁడై యడుగుల కెఱఁగి
వినయంబుతోఁ బెక్కువిధములఁ బొగడి
తనయపరాధమంతయు నెఱిఁగించి
గోవత్సయుతముగా గోప బాలకుల
నావిశ్వనాథున కర్పించి చనియె
ధేనుకుఁడను రక్కసుఁడు ఖరరూపమున రాగా బలరాముఁడు వానిని సంహరించుట
తాళీవనము చొచ్చి తన జోడుకలకు
తాళఫలంబులుఁ దనియంగ మేపి
తిరముగా నచ్చోట ధేనుకుం డనఁగ
ఖరరూపమున నుండు కఱకు దానవుని
291
చరణముల్ వట్టి వృక్షంబుతోఁ గొట్టి
పరిమార్చె రాముండు బలిమి దీపించ
యమునానదిని విషపూరితము చేసిన కాళి యాహి మదమణఁచి శ్రీ కృష్ణుఁడా విషసర్పమును సముద్రమునకు వెళ్ళునట్లాజ్ఞాపించుట
ఒకనాడు యమునలో నుదకంబుఁ ద్రావి
సకల గోగోపకసంఘముల్ బడలి
యపుడ మూర్ఛిల్లిన నమృతంబుఁగురియు
విపులాత్మ దృష్టిచే వెసఁ బ్రదికించి
యానదిలో నుండు నాకాళియాహిఁ
దానాత్మశక్తిచేఁ దలఁగింపఁ దలఁచి
నడుమ నంశుక బంధనము బలియించి
కడఁకతో దరినున్న కడిమిచెట్టెక్కి
శౌరియా నదిలోని సరసిలో నుఱికెఁ
గూరిమిఁగల గోపకులు చూచి బెదర
అప్పుడా నీరు నూరమ్ముల పెట్టు
విప్పుగాఁ దొట్టెడు విపుల నాదంబు
విని,కాళియాహియు వెడలి యా కృష్ణు
ఘనతర మర్మముల్గఱచెఁ గోపమున
మఱియు నా భుజగంబు మచ్చరం బెసఁగ
వఱలు కృష్ణుని మేనువడిఁ జుట్టుకొనియె
యేమియుం జేయ కట్లించుక సేపు
తామరసాక్షుఁ డుద్ధతి మానియుండి