పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-470-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణ శరణ్యుఁడ వగు నిను
ణము వేఁడెదము; మాకు త్కృప నన్నం
సి కృపచేసి ప్రోవుము
నాయక!” యనుచుఁ బ్రజలు తులై పలుకన్.

టీకా:

శరణ = రక్షణ కోరెడివారికి; శరణ్యుడవు = అభయము నిచ్చెడి వాడవు; అగు = అయిన; నినున్ = నిన్ను; శరణము = రక్షణము; వేడెదము = కోరుతున్నాము; మాకున్ = మాకు; సత్ = మంచి; కృపన్ = దయతో; అన్నంబున్ = ఆహారము దొరకు ఉపాయము; అరసి = విచారించి; కృపన్ = దయతో; చేసి = చూపి; ప్రోవుము = కాపాడుము; నరనాయక = రాజ {నర నాయకుడు - నరుల (మానవుల)కు నాయకుడు, రాజు}; అనుచున్ = అంటూ; ప్రజలు = జనులు; నతులు = వినయముతో వంగినవారు; ఐ = అయ్యి; పలుకన్ = ప్రార్థించగా.

భావము:

రక్షణ కోరేవారికి అభయమిచ్చే నిన్ను శరణు వేడుకుంటున్నాము. రాజా! దయతో మాకు అన్నం పెట్టి రక్షించు’’ అని వినయంతో వంగి నమస్కరించి ప్రార్థించగా…