పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : యశోద గోపికల నొడంబరచుట

  •  
  •  
  •  

10.1-332- తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్య మెఱుఁగఁడు; తన యంత నాడుచుండు;
మంచివాఁ డీత; డెగ్గులు మానరమ్మ!
రామలార! త్రిలోకాభిరామలార!
ల్లులార! గుణవతీమల్లులార!"

టీకా:

అన్యమున్ = ఇతర మైన వేమి, తనకు వేరైనది; ఎఱుగడు = తెలియనివాడు, అసలు లేనివాడు; తనయంతన్ = అతనంటతనే, ఆత్మా; ఆడుచుండున్ = ఆడుకొనుచుండును, రాముడు; మంచివాడు = ఉత్తముడు; ఈతడు = ఇతను; ఎగ్గులు = నిందలు, చాడీలు; మానరు = మానివేయండి; అమ్మ = తల్లి; రామలార = మనోజ్ఞరాళ్ళూ; త్రిలోక = ముల్లోకములను; అభి = మిక్కిలి; రామలార = ఆనందింపజేసే ఇంతులూ; తల్లులారా = మా అమ్మలారా; గుణవతీమ తల్లులారా = సుగుణవంతులలో శ్రేష్ఠులారా.

భావము:

తల్లులల్లారా! మనోజ్ఞమైన మగువల్లారా! ముల్లోకాలకు మోదం కలిగించే ముదితల్లారా! నామాట వినండి. ఇతను ఇతరమైనదేది ఎరుగడు. తనంతట తనే క్రీడిస్తు ఉంటాడు. మా కన్నయ్య ఎంతో మంచివాడు అమ్మలార! సకల సద్గుణవతీ లలామల్లారా! ఇతనిపై అపనిందలు వేయకండమ్మా." తల్లి యశోదాదేవి తన వద్దకు వచ్చి బాలకృష్ణుని అల్లరి చెప్పే గోపికలను సమాధాన పరుస్తోంది.