పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శృంగి శాపంబు

  •  
  •  
  •  

1-488-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెలఁగరు కలఁగరు సాధులు
మిళితములయి పరులవలన మేలుం గీడున్
నెకొనిన నైన నాత్మకు
నొయవు సుఖదుఃఖచయము యుగ్మము లగుచున్.""

టీకా:

చెలఁగరు = రెచ్చిపోరు; కలఁగరు = క్రుంగిపోరు; సాధులు = మంచి నడవడిక కలవారు; మిళితములు = కలగలుపులు; అయి = అయి; పరుల = ఇతరుల; వలనన్ = వలన; మేలున్ = మంచి; కీడున్ = చెడులు; నెలకొనినన్ = కలిగినట్లు; ఐన = అయినను; ఆత్మ = ఆత్మ; కున్ = కి; ఒలయవు = కలుగవు; సుఖ = సుఖముల; దుఃఖ = దుఃఖముల; చయములు = సమూహములు; యుగ్మములు = ద్వంద్వములు; అగుచున్ = అవుతూ.

భావము:

ద్వంద్వాలకు కోపతాపాలకు లొంగరు, భగవంతునిపై ప్రపత్తి విడువరు, సుఖదుఃఖాలకు కలగరు. సజ్జనులు ఇతరులు చేసిన మేలులకు పొంగిపోరు, కీడులకు కుంగిపోరు. మహాత్ముల ఆత్మలను సుఖదుఃఖాలు ఆవహించవు.”
భాగవతుల లక్షణాలను తెలుపుతు భాగవతంలో తన కొడుకు పరీక్షిత్తును శపించుటకు సంతోషించని శృంగి తండ్రి శమీకమహర్షి నోట ఇలా పలికించారు.