ద్విపదభాగవతం - కల్యాణకాండ : శ్రీకృష్ణుఁడు రుక్మిణి చిత్తమును శోధించుట
కెల్ల నింపొదవించు నింతి నెమ్మనముఁ
గనుఁగొను వేడుకఁ గలుషించినట్లు
వనజాతనేత్రుఁడవ్వనిత కిట్లనియె.
“రాజన్యుని విదర్భరాజు కూఁతురవు!
భూజనులెల్లర పొగడొందునట్టి
లావణ్య భాగ్య విలాస చాతుర్య
వీ వసుంధర నీకు నీడు లేదెందు!
పరగు మాగధచైద్యపౌండ్రాది నృపులు
వర రూప భాగ్య లావణ్య సంపన్ను
లారూఢ సామ్రాజ్యులతులవిక్రములు
వారలు నినుఁగోరి వచ్చిన చోట
నందఱ నొల్లక యతిహీనకులుని
మందలోఁ బెఱిగిన మలినాంగు భీరు
నాచారదూరుని ననృతవర్తనుని
యే చూపుఁ జూచి నన్నేల కామించి
తాదిగర్భేశ్వరి వక్కటా! పుట్టు
బీదను! నను నీవు పెండ్లిగాఁదగునె? 690
మీయన్న రుక్మిమామీఁది క్రౌర్యంబుఁ
బాయఁడు; మీతండ్రి పగవాఁడు నాకు;
నీవును నామీఁద నెయ్యంబు లేవు
కావున నీయింటి కడకు నీ వరిగి
వలనొప్పఁగన్నిచ్చ వచ్చినవారిఁ
గలసి భోగించుము కమలాస్య!” అనిన
నామాఁట తనకునమ్మై తాఁకుటయును
భామినీమణి డిల్లపడి మూర్ఛ మునిఁగె!
నుడివడి చేనున్న సురటల్ల జాఱఁ
దొడిగిన సొమ్ములు తొడుసూడి పడఁగఁ
దన్ను దానెఱుఁగక ధర వ్రాలియున్న