ద్విపదభాగవతం - కల్యాణకాండ : శ్రీకృష్ణజాంబవంతుల యుద్ధము
యట్టహాసము సేసి హరిఁగిట్టి ముష్టి
ఘట్టసంబులఁ బాదఘాతల నొంపఁ
గడఁగి మాధవుఁడు నిర్ఘాతంబు వోని
పిడికిటఁ బొడిచిన బెదరక జాంబ 370
వంతుఁడు మురవైరివక్షంబుఁ బొడువ
నంతకాకారుఁడై హరివానిఁ దాఁకె
ఇరువురు నీరీతి నిరువది దినము
లురువడి పోరాడి యొగి కైటభారి
భల్లూకపతిగుండెఁ బగులంగఁ బొడువ
నొల్లనొల్లన వోయి యురుమూర్ఛఁ దెలిసి
యేయుగంబులయందు నీరీతిఁ దొడరి
పాయకిర్వదినాళ్ళు బవరంబు సేయ
నెవ్వీరునకుఁ జెల్లు నితఁ డింత సేసె
నెవ్వరోకో! అని యిచ్చలోఁ దలఁచి
యంబుజోదరు నట నాత్మలోఁ దెలిసి
జాంబవంతుఁడు భక్తి సాష్టాంగ మెఱఁగి
చేతులు మొగిడించి శిరసునఁ దాల్చి
యాతతప్రీతి నిట్లని సన్నుతుంచె.
“దేవ! జగన్నాథ! దేవేంద్రవంద్య!
గోవింద! కృష్ణ! ముకుంద! సర్వేశ!
నీవాదిమూర్తివి నిగమార్థవిదులు
భావించి కనియెడి పరమాత్మవీవ!
పొరిపొరి బ్రహ్మవై పుట్టింతు జగము!
హరిమూర్తివై నీవె యనిశంబు బ్రోతు! 380
హరుఁడవై యడగింతు నఖిలభూతములఁ
బరమాత్మ! నీలీలఁ బ్రణుతింప వశమె?
దశరథాత్మజుఁడవై ధరణిఁ బాలించి
దశకంఠు గెలిచి సీతాదేవిఁ దెచ్చు
శ్రీరాముఁడవు నిన్నుఁ జింతింప మఱచి
వైరంబు గొని పోరి వంచితు నైతి
నాతప్పు సైరించి నన్ను మన్నించు
నీ తత్వ మెఱుఁగంగ నేర్తునే” యనిన
“నాతోడ నిరువదినాళ్ళు పోరాడ
భూతేశునకునైనఁ బోలునే యందుఁ
బెద్దవు నీవు నా పిడికిళ్ళు దాఁకి