పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ వామన చరిత్ర : ముందుమాట

ముందుమాట:- మన తెలుగుల పుణ్యపేటి, జాతీయ మహా కవి, సహజ కవి, బమ్మెఱ పోతనామాత్యుల వారి ప్రణీతమైన శ్రీమద్భాగవతము నందలి అనేక అద్భుతమైన ఉపాఖ్యానములలో రుక్మిణీ కళ్యాణము (దశము స్కంధము - పూర్వ భాగము), గజేంద్ర మోక్షణము (అష్టమ స్కంధము), ప్రహ్లాద భక్తి(సప్తమ స్కంధము), వామన చరిత్ర (అష్టమ స్కంధము), కుచేలోపాఖ్యానము (దశమ స్కంధము - ఉత్తర భాగము) అను అయిదూ పంచ రత్నాలుగా బహుళ ప్రసిద్ధి పొందాయి.
ఈ వామన చరిత్ర బహు ప్రసిద్ధి పొందిన కథ. బలి చక్రవర్తిని మూడడుగుల నేల అడిగి, వామనుడు పెరిగి పెరిగి త్రివిక్రమావతారుడై రెండడగులతోనే విశ్వమంతా నిండిపోయాడు. ఇందలి అనేక పద్యాలు బహుళ వ్యాప్తిని పొందాయి. ముఖ్యంగా "ఇంతింతై . . ." వంటి పద్యాలు చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపుతాయి.
జాలతెలుగులారా! ఈ అనర్ఘ్య రత్నాన్ని, ఆనందంగా ఆస్వాదించండి.