పద్య మధురిమలు : కమ్మని గ్రంథం బొక్కటి
కమ్మని గ్రంథం బొక్కటి
ఒకమారు శ్రీనాథుడు వచ్చి పోతనను భాగవతం రాజుకి అంకిత మిమ్మని నచ్చచెప్తూ చెప్పిన ప్రసిద్ధ చాటువు. .
క.
కమ్మని గ్రంథం బొక్కటి
యిమ్ముగ నే నృపతికైన కృతి ఇచ్చిన కై
కొమ్మని యీ యరె అర్థం
బిమ్మహి దున్నంగ నేల ఇట్టి మహాత్ముల్
- శ్రీనాథ మహాకవి చాటువు
దానికి పోతన ఈ బాలరసాలసాల పద్యంతో సమాధానం చెప్పాడట. .