పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : ఎండిన మ్రోడులే

ఎండిన మ్రోడులే



ఉ.

ఎండిన మ్రోడులే కిశలయించెనొ!యేకశిలాపురమ్ములో

బంలు పుల్కరించెనొ!పార ముదమ్మున తెల్గు తల్లికిన్

గుండెలు పొంగిపోయి కనుగొల్కులునిండెనొ!పచ్చిపైరులే

పండెనొ జాలువారిన!త్కవితామృత భక్తిధారలన్!

- కరుణశ్రీ – ఉదయశ్రీ

ఓ బమ్మెర పోతనామాత్యా! ఏకశిలానగరంలో మీరు భాగవత పురాణం ఆంధ్రీకరిస్తుండగా మీ యొక్క అమృత కవితలలో నుండి జాలువారిన భక్తి అను వర్షపు ధారలలో తడిసి ఎండి మోడువారిన చెట్లు కూడ చిగురించి ఉంటాయి. తెలుగు తల్లి గుండెలు అనంతమైన ఆనందంతో పొంగిపోయి, కనులు చెమరించి ఉంటాయి. కొత్తగా మొలకలెత్తి ఇంకా పండని పంటలు పండిపోయి ఉంటాయి.