పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట

  •  
  •  
  •  

7-209-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లకుఁ దన్ను రమ్మని
పాటించి నిశాటసుతులు భాషించిన దో
షాకులేంద్రకుమారుఁడు
పావమున వారిఁ జీరి ప్రజ్ఞాన్వితుఁడై.

టీకా:

ఆటల = క్రీడల; కున్ = కు; తన్ను = తనను; రమ్ము = రావలసినది; అని = అని; పాటించి = పట్టుపట్టి, బతిమాలి; నిశాట = రాక్షస; సుతులు = బాలురు; భాషించినన్ = అడుగగా; దోషాట = (దోషవర్తన గల) రాక్షస; కుల = వంశ; ఇంద్ర = రాజు యొక్క; కుమారుడు = పుత్రుడు; పాటవమున = నేర్పుతో; వారిన్ = వారిని; చీరి = పిలిచి; ప్రజ్ఞ = తెలివి; ఆన్వితుడు = కలవాడు; ఐ = అయ్యి.

భావము:

అతనితో చదువుకుంటున్న రాక్షసుల పిల్లలు తమతో ఆడుకోడానికి రమ్మని పిలిచారు. అప్పుడు దోషాచారులు దానవుల చక్రవర్తి కుమారుడు, మంచి ప్రజ్ఞానిధి అయిన ప్రహ్లాదుడు వారితో చేరి నేర్పుగా ఇలా చెప్పసాగాడు.