పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : త్రిపురాసుర సంహారము

  •  
  •  
  •  

7-394-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సకలలోకేశ్వరుం డగు మహేశ్వరుం జేరి లోకపాలకులు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకుళించి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సకలలోకేశ్వరుడు = పరమశివుడు {సకలలోకేశ్వరుడు - ఎల్లలోకములకు ప్రభువు, శివుడు}; మహేశ్వరున్ = పరమశివుని {మహేశ్వరుడు - గొప్పఈశ్వరుడు, శివుడు}; చేరి = చేరి; లోకపాలకులు = లోకేశులు; ప్రణతులు = నమస్కరించినవారు; ఐ = అయ్యి; పూజించి = పూజలుచేసి; కర = చేతులు యనెడి; కమలంబులు = పద్మములు; ముకుళించి = జోడించి.

భావము:

లోకేశ్వరుడగు పరమేశ్వరుని ఇలా చేరి లోకపాలకులు నమస్కరించి పూజించారు.కమలాల వంటి తమ చేతులు జోడించి ఇలా అన్నారు