పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-143-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను రక్షించిన పుణ్యవంతులు కనన్నాళీకపత్రాక్షు లం
సంకాశులు శంఖచక్రధరు లాజానూరుబాహుల్ స్మితా
ను లాలంబిత కర్ణవేష్టన సువర్ణచ్ఛాయ దివ్యాంబరుల్
కారుణ్య రసైకపూర్ణులు సమగ్రస్ఫూర్తి నెం దేఁగిరో?

టీకా:

ననున్ = నన్ను; రక్షించిన = కాపాడినట్టి; పుణ్యవంతులు = పుణ్యాత్ములు; కనత్ = తళుక్కుమంటున్న; నాళీకపత్ర = పద్మపత్రములవంటి; అక్షులు = కన్ను లున్నవారు; అంజన = కాటుకు; సంకాశులు = సమానమైన వర్ణము గలవారు; శంఖ = శంఖము; చక్ర = చక్రమును; ధరులు = ధరిండెడివారు; ఆజాను = మోకాళ్ళవరకు తాకుతున్న; ఉరు = పెద్ద; బాహులు = చేతులుగలవారు; స్మిత = చిరునవ్వుగల; ఆననులు = ముఖము గలవారు; ఆలంబిత = వేళ్ళాడుతున్న; కర్ణవేష్టన = కుండలములు, చెవిపోగులు; సువర్ణ = బంగారు; ఛాయ = రంగు; దివ్య = దివ్యమైన; అంబరుల్ = వస్త్రములు గలవారు; ఘన = అతిగొప్ప; కారుణ్య = దయా; రస = రసము; ఏక = అంతయు; పూర్ణులు = నిండినవారు; సమగ్ర = సంపూర్ణమైన; స్ఫూర్తిన్ = శోభతో; ఎందున్ = ఎక్కడకు; ఏగిరో = వెళ్ళినారో.

భావము:

నన్ను రక్షించిన ఆ పుణ్యమూర్తులు, పద్మాక్షులు, నీలవర్ణులు, శంఖచక్రాలను ధరించినవాళ్ళు, ఆజానుబాహులు, కనకాంబర ధారులు, చిరునవ్వు లొలకబోసే ముఖాలు కలిగినవాళ్ళు, భుజాల వరకు వ్రేలాడే మకర కుండలాలను ధరించినవాళ్ళు, కరుణారస పరిపూర్ణులు, పూర్ణశోభతో కూడిన ఆ మహాత్ములు ఎక్కడికి వెళ్ళిపోయారో?