పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-107-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బంధులఁ దిట్టి సజ్జనులఁ బాధలఁ బెట్టి యనాథకోటిఁ బెం
బందెలు చుట్టి యీరములు ట్టి పథంబులు గొట్టి దిట్టయై
నింల కోర్చి సాధులకు నిందితుఁడై గడియించు విత్త మా
సుంరి కిచ్చి మచ్చికలు సొంపెదఁ గూర్చి వసించెఁ దత్కృపన్.

టీకా:

బంధులన్ = బంధువులను; తిట్టి = దూషించి; సజ్జనులన్ = మంచివారిని; బాధలబెట్టి = బాధించి; అనాథ = దిక్కులేనివారి; కోటిన్ = సమూహములను; పెంపున్ = నాశనము చేసెడి; పందెలు = జూదరులతో; చుట్టి = స్నేహము చేసి; ఈరములు = పొదలలో; పట్టి = దూరి యుండి; పథంబులుగొట్టి = దారిదోపిడీలు చేసి; దిట్ట = ఆరితేరినవాడు; ఐ = అయ్యి; నిందలు = తిట్ల; కున్ = కు; ఓర్చి = ఓర్చుకొనుచు; సాధుల = సాధుజనుల; కున్ = చేత; నిందితుండు = నిందింపబడువాడు; ఐ = అయ్యి; గడియించు = సంపాదించెడి; విత్తము = ధనమును; ఆ = ఆ; సుందరి = స్త్రీ; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చివేసి; మచ్చికలు = చనువుల; సొంపు = అందమును; ఎదన్ = మనసున; కూర్చి = కూర్చుకొని; వసించె = జీవించెను; తత్ = ఆమె; కృపన్ = దయతో.

భావము:

బంధువులను తిట్టి, సజ్జనులను బాధించి, దిక్కులేని దీనులను చిక్కులపాలు చేసి, దారులు కొట్టి దోచుకొనడంలో దిట్టయై, నిందలను లెక్క చేయకుండా సంపాదించిన ధనాన్ని ఆ సుందరి కిచ్చి ఆమె చనువును, అందాన్ని మెచ్చిన మనస్సుతో జీవింపసాగాడు.