పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-342-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమపురుష! దుఃఖభంజన! పరమేశ!
క్తవరద! కృష్ణ! వవిదూర!
లరుహాక్ష! నిన్ను రణంబు వేఁడెద
భయ మిచ్చి కావయ్య! మమ్ము.

టీకా:

పరమపురుష = హరి {పరమ పురుషుడు - సర్వాతీతమైన పురుషుడు, విష్ణువు}; దుఃఖభంజన = హరి {దుఃఖ భంజనుడు - దుఃఖములను భంజన (నాశము చేయువాడు), విష్ణువు}; పరమేశ = హరి {పరమేశుడు - పరమ (అత్యున్నతమైన) ఈశుడు (ఈశ్వరుడు), విష్ణువు}; భక్తవరద = హరి {భక్త వరదుడు - భక్త (భక్తులకు) వరదుడు (వరములను యిచ్చువాడు), విష్ణువు}; కృష్ణ = హరి {కృష్ణుడు - నల్లనివాడు}; భవవిదూర = హరి {భవ విదూరుడు - భవ (సంసార బంధనములను) విదూరుడు (తొలగించెడివాడు), విష్ణువు}; జలరుహాక్ష = హరి {జలరుహాక్షుడు - జలరుహము (పద్మము) వంచి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; నిన్ను = నిన్ను; శరణంబున్ = శరణమునకై; వేడెదము = ప్రార్థించెదము; అభయము = రక్షణ; ఇచ్చి = ఇచ్చి; కావు = కాపాడుము; అయ్య = తండ్రి; మమ్ము = మమ్ములను.

భావము:

ఓ పరమ పురుషా! దుఃఖనాశకా! పరమేశ్వరా! భక్రవత్సలా! కృష్ణా! భవబంధాలను దూరం చేసే పద్మాక్షుడవు. నిన్ను శరణు జొచ్చినాము. అభయమిచ్చి మమ్ము కాపాడు.