ద్వాదశ స్కంధము : మార్కండేయోపాఖ్యానంబు
- ఉపకరణాలు:
"జగము రక్షింప జీవులఁ జంప మనుపఁ
గర్తవై సర్వమయుఁడవై కానిపింతు
వెచట నీ మాయఁ దెలియంగ నెవ్వఁ డోపు?
విశ్వసన్నుత! విశ్వేశ! వేదరూప!
టీకా:
జగము = లోకమున; రక్షింపన్ = కాపాడుటకు; జీవులన్ = ప్రాణులను; చంపన్ = చంపడానికి; మనుపన్ = పోషించుటకు; కర్తవు = కర్తవు; ఐ = అయ్యి; సర్వ = సర్వమునందు; మయుడవు = నిండియుండువాడవు; ఐ = అయ్యి; కానిపింతువు = గోచరింతువు; ఎచటన్ = ఎక్కడైనా; నీ = నీ యొక్క; మాయన్ = మహిమను; తెలియంగన్ = తెలిసికొనుటకు; ఎవ్వడు = ఎవరుమాత్రము; ఓపున్ = చేయగలడు; విశ్వసన్నుత = హరి {విశ్వసన్నుతుడు - లోకములచే స్తుతింపబడువాడు, విష్ణువు}; విశ్వేశ = హరి {విశ్వేశుడు - విశ్వమునకు ప్రభువు, విష్ణువు}; వేదరూప = హరి {వేదరూప - వేదములు తన రూపమైనవాడు, విష్ణువు}.
భావము:
“విశ్వేశా! వేదరూపా! విశ్వసన్నుతా! జగత్తును, ప్రాణులను పుట్టించడానికీ పోషించడానికీ చంపడానికీ నీవే కర్తవు. నీవే సర్వమయుడవు. నీ మాయను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.