పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శ్రుతదేవ జనకుల చరిత్రంబు

  •  
  •  
  •  

10.2-1188-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీ పురుషోత్తమాఖ్య! యదుసింహకిశోరక! భక్తలోకర
క్షారతంత్ర! నీవు మునిసంఘముఁ గొన్నిదినంబు లుండవే
నీ దపద్మ రేణువులు నెమ్మి మదీయగృహంబు సోఁకినం
దాసవంద్య! యే నిపుడ న్యుఁడ నయ్యెదఁగాదె మాధవా!”

టీకా:

శ్రీ = ఐశ్వర్యవంతుడైన; పురుషోత్తమ = పురుషోత్తముడు అను; ఆఖ్య = పేరు కలవాడా; యదు = యదువంశపు; సింహ = సింహపు, శ్రేష్ఠమైన; కిశోరక = పిల్లవంటివాడా; భక్త = భక్తుల; లోక = అందరిని; రక్షా = రక్షించుట యందు; పరతంత్ర = లగ్నమై ఉండువాడా; నీవు = నీవు; ముని = మునుల; సంఘమున్ = సమూహము; కొన్ని = కొన్ని; దినంబులు = రోజులు; ఉండవే = ఉండుము; నీ = నీ; పద = పాదములు అను; పద్మ = పద్మముల; రేణువులు = ధూళికణములు; నెమ్మిన్ = ప్రీతితో; మదీయ = నా యొక్క; గృహంబున్ = ఇంటికి; సోకినన్ = తాకినను; తాపస = ఋషులచే; వంద్య = నమస్కరించువాడు; ఏను = నేను; ఇపుడ = వెంటనే; ధన్యుడను = కృతార్థుడను; అయ్యెద = ఔతాను; కాదె = కదా; మాధవా = కృష్ణా {మాధవుడు - లక్ష్మీపతి, విష్ణువు}.

భావము:

ఓ యదు సింహమా! నందకిశోరా! భక్తరక్షణ పరాయణా! పురుషోత్తముడు అనే సార్థక నామధేయం కలవాడ! నీవూ ఈ మునులు కొన్నాళ్ళపాటు ఇక్కడే ఉండండి. నీ పాదధూళి నా గృహములో సోకితే చాలు నేను ధన్యుడిని అవుతాను కదా.”