పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : అర్జునితో మృగయావినోదంబు

  •  
  •  
  •  

10.2-113-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చ్చోటఁ బవిత్రములై
చ్చిన మృగరాజి నెల్ల ననాథునకుం
దెచ్చి యొసంగిరి మెచ్చుగఁ
జెచ్చెర నరుఁ గొల్చి యున్న సేవకు లధిపా!

టీకా:

ఆ = ఆ; చోటన్ = ప్రదేశము నందు; పవిత్రములు = పరిశుద్ధమైనవి, తినదగినవి; ఐ = అయ్యి; చచ్చిన = చచ్చిపోయిన; మృగ = జంతువుల; రాజిన్ = సమూహము; ఎల్లన్ = అన్నిటిని; జననాథున్ = రాజున {జననాథుడు - మానవులకు ప్రభువు, రాజు}; కున్ = కు; తెచ్చి = తీసుకువచ్చి; ఒసంగిరి = ఇచ్చిరి; మెచ్చుగన్ = మెచ్చుకొనునట్లుగ; చెచ్చెరన్ = శీఘ్రముగా; నరున్ = అర్జునుని; కొల్చి = సేవించుచు; ఉన్న = ఉన్నట్టి; సేవకులు = బంట్లు; అధిపా = రాజా.

భావము:

అలా చనిపోయిన అర్హ మృగాలను అన్నింటినీ ధర్మరాజు మెచ్చుకునేలా అర్జునుడి సేవకులు శీఘ్రంగా తెచ్చి ఆయనకు ఇచ్చారు.